telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కేటీఆర్ కు దుబ్బాక ఎమ్మెల్యే సవాల్…

Raghunandan

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ… కరీంనగర్ లో హిందూ గాళ్ళు బొందు గాళ్లు ఆన్న కెసిఆర్ కు బుద్ది చెప్పారని అలాగే 10 రోజుల క్రితం నల్లగొండలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ లని కుక్కలు ఆన్న కెసిఆర్ కు కూడా కరీంనగర్ ఫలితం తో బుద్ది చెప్పాలని అన్నారు. లక్ష 32 వేల ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్ పోలీస్ బందో బస్తు లేకుండా హాలియ, ఒస్మానియా కు వచ్చి ఆ మాట చెప్పు అంటూ సవాల్ విసిరారు. ఈ రాష్ట్రం లో దళితుల తర్వాత మోసగించ బడింది గిరిజనులేనని 2018 ఎన్నికల్లో వచ్చి కుర్చీ వేసుకుని కాల్వల్లో నీరు పారిస్త అన్నాడు… కానీ కుర్చీ దొరకలేదేమో… మనమే వేద్దామని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చెయ్యలేదు… కనీసం ప్రతిపక్షంలో ఉన్నపుడు అయిన పోరాటం చేయలేదు ఇలాంటి నాయకుడు ఉంటే ఏంటి పోతే ఏంటి అని అయన ప్రశ్నించారు. 10 జిల్లాలు పాలించే కేసీఆర్ కు అంతఉంటే 7వందల జిల్లాలు పాలించే మాకు ఎంత ఉండాలని ఆయన ప్రశ్నించారు. మీ మీద కేసులు అయితే రూపాయి ఖర్చు లేకుండా మీ తరపున పోరాడతానని ఆయన అన్నారు.

Related posts