telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాయలసీమను రెండో రాజధాని చేయాలి.. టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు!

TG Venkatesh MP

గత కొంతకాలంగా ఏపీ రాజధాని అమరావతిని మారుస్తున్నారంటూ రాష్ట్రంలో జోరుగా ప్రచారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని రెండో రాజధాని చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీజీ వ్యాఖ్యల కారణంగానే మరో సారి ఏపీ రాజధానిపై దుమారం రేగింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ ఐక్య వేదికగా 17 ఏళ్ల నుండి కృషి చేస్తుందన్నారు.

గత పాలకులు కర్నూలు నుంచి రాజధానిని తెలంగాణను తరలిస్తున్నా ఊరికే ఉన్నారని చెప్పారు. ఇప్పుడున్న నాయకులు కూడా ఆంధ్ర ప్రాంతాన్నే అభివృద్ధి చేపడుతున్నారన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. న్యాయవాదుల న్యాయమైన కోరికలు వెంటనే పరిష్కరించి కర్నూల్లో హైకోర్టును ఏర్పాటు చేయాలని వారికి మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేందుకు తాను కూడా ఢిల్లీలో వాదనలు వినిపిస్తానని పేర్కొన్నారు.

Related posts