telugu navyamedia
రాజకీయ వార్తలు

హత్యలపై యూపీ ప్రభుత్వం దర్యాప్తు జరపాలి: ప్రియాంక

Priyanka

ఉత్తరప్రదేశ్ లో జరిగిన హత్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ట్విటర్ లో స్పందించారు. రాష్ట్రంలో గత 15 రోజుల్లో 100 మంది హత్యకు గురయ్యారని ఆమే ఆరోపించారు. మూడు రోజుల క్రితం ఎటాలో పచౌరి కుటుంబానికి చెందిన ఐదు మృతదేహాలను పోలీసులు అనుమానాస్పద స్థితిలో కనుగొన్నారని చెప్పారు.

ఎవరు ఈ హత్యలు చేశారనే విషయాలు ఇంత వరకు తెలియలేదని అన్నారు. ఈ హత్యలపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ డిమాండ్ చేశారు.

Related posts