telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : కింగ్స్ విజయం….

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ముంబై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాయల్స్ బౌలర్లు పంజాబ్ బ్యాట్స్మెన్స్ ను కట్టడి చేయలేకపోయారు. దాంతో నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఇక 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగ్గిన రాజస్థాన్ కు మొదట్లోనే షాక్ ఇచ్చారు పంజాబ్ బౌలర్లు. ఆ జట్టు ఓపెనర్లను త్వరగా పెవిలియన్ కు చేర్చారు. కానీ ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ పంజాబ్ కు షాక్ ఇచ్చాడు. జట్టులోని ప్రతి బౌలర్ ను ఉతికేసిన సంజు సెంచరీ పూర్తి చేసి మ్యాచ్ వారి వైపుకు తిప్పాడు. ఇంకా రాయల్స్ విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రెండు సింగిల్స్ తర్వాత సంజు సిక్స్ తో చివరి బంతికి 5 పరుగులు అవసరం అయ్యాయి. కానీ పంజాబ్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మొదటి నుంచి ధీటుగా ఆడిన సంజు 119 పరుగులు చేసి ఆ బాల్ కు ఔట్ కావడంతో పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు పంజేబ్ ఇన్నింగ్స్ లో అయితే ఓపెనర్ మయాంక్(14) ఔట్ అయిన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన గేల్(40) తో కలిసి కెప్టెన్ రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ గేల్ పెవిలివన్ చేరుకున్న తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా 20 బంతుల్లో అర్ధశతకంతో రెచ్చిపోయాడు. రాహుల్, హుడా కలిసి మూడో వికెట్ కు 104 పరుగులు జోడించారు. ఇక 64 పరుగుల వద్ద హుడా వెనుదిరగగా కెప్టెన్ రాహుల్ 91 పరుగులు చేసాడు.

Related posts