దేశంలో భారతరత్న తర్వాత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ అవార్డులను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక దర్బార్ హాల్లో అందించారు. . ఈ సందర్భంగా పలు రంగాల్లో సేవలందించిన వారికి ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను ప్రధానం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ముఖ్యమైన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈసారి రెండేళ్లపాటు అవార్డులు ఇస్తున్నారు. 2020లో మొత్తంలో 119మందిని పద్మాలు వరించాయి. 119 మందిలో 29 మంది మహిళలు ఉన్నారు. 16 మందికి చనిపోయిన అనంతరం అవార్డు ప్రకటించారు.
2021 సంవత్సరానికి పద్మ అవార్డుల జాబితాలో, 7 మందికి అతిపెద్ద పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించనున్నారు. దీంతో పాటు 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు.
అదే సమయంలో, 2020 సంవత్సరానికి, 7 మందికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు. అవార్డు గ్రహీతలలో 29 మంది మహిళలు, 16 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు, 1 ట్రాన్స్జెండర్ అవార్డు గ్రహీత ఉన్నారు.
స్టార్ షట్లర్ పీవీ సింధుకు పద్మ భూషన్, బాలీవుడ్ నటికి కంగనా రనౌత్కు పద్మశ్రీ, నిర్మాత ఏక్తా కపూర్, సింగర్ అద్నాన్ సమీకి పద్మశ్రీ, నిర్మాత కరణ్ జోహార్కు పద్మ శ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రదానం చేశారు. మరణానంతరం అరుణ్ జైట్లీకి పద్మ విభూషన్, సుష్మా స్వరాజ్, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు పద్మ విభూషన్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. విజయవాడ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామి, అనంతపురానికి చెందిన సాహితీవేత్త ఆశావాది ప్రకాశ్రావు, తొలి మృదంగ కళాకారిణి విజయవాడకు చెందిన నిడుమోలు సుమతి రాష్ట్రపతి చేతులమీదిగా పద్మ శ్రీ పురాస్కారాన్ని స్వీకరించారు. తెలంగాణ కళాకారుడు కనకరాజుకు రాష్ట్రపతి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేశారు.
పద్మవిభూషణ్ 2020..
*జార్జ్ ఫెర్నాండెజ్ (మరణానంతరం)
* అరుణ్ జైట్లీ (మరణానంతరం)
* సుష్మా స్వరాజ్ (మరణానంతరం)
*మారిషస్ మాజీ అధ్యక్షుడు, ప్రధాన మంత్రి అనిరుద్ధ జుగ్నాథ్ (మరణానంతరం)
* ఆర్ట్స్ కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన పండిట్ చన్నులాల్ మిశ్రా
*క్రీడల కోసం మణిపూర్ మేరీ కామ్
* ఆధ్యాత్మికత కోసం కర్ణాటకలోని ఉడిపిలోని పెజావర్ మఠానికి చెందిన శ్రీ విశ్వేశతీర్థ స్వామి (మరణానంతరం)
పద్మవిభూషణ్ 2021లో అందుకోన్నవారు
*జపాన్ మాజీ ప్రధాని షింజో అబే
*తమిళ గాయకుడు SP బాలసుబ్రమణ్యం (మరణానంతర కళ)
*మౌలానా వహీదుద్దీన్ ఖాన్
*డా. బేల మొన్నప హెగ్డే
*బీబీ లాల్
*అమెరికాకు చెందిన నరీందర్ సింగ్ కపానీ
*ఆర్ట్స్ కోసం సుదర్శన్ సాహో