telugu navyamedia
తెలంగాణ వార్తలు

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఊర‌ట‌..

ఎట్ట‌కేల‌కు తీన్మార్ మ‌ల్ల‌న్న అలియ‌స్ చింత‌పండు న‌వీన్‌కుమార్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ల్ల‌న్న‌పై 38 కేసులు న‌మోద‌య్యాయి. వాటిలో ఆరు కేసుల‌ను హైకోర్టు కొట్టివేసింది. మిగిలిన 32 కేసుల్లో 31 కేసుల‌కు బెయిల్ మంజూరైంది.

అయితే, గ‌త 74 రోజులుగా తీన్మార్ మ‌ల్ల‌న్న జైల్లోనే ఉన్నారు. హైదరాబాద్ చిలకలగూడాతో సహా రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులలో తీన్మార్ మల్లన్న ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఒక కేసులో బెయిల్ పై బయటకు రాగానే మరో కేసులో తీన్మార్ మల్లన్నను ఇరికించి జైలుకు పంపించ‌డంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. ఇక ఈ కేసులలో సతమతమవుతున్న తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఊర‌ట క‌ల్పించింది.

Related posts