ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కరోనా వాళ్ళ విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో కొందరు దర్శకులు కరోనాపై సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కరోనాపై రామ్ గోపాల్ వర్మ చిత్రాన్ని చేస్తున్నట్టు ప్రకటించడంతో పాటు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా కరోనా నేపథ్యంలో సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబందించిన ప్రీ లుక్ రేపు ఉదయం 9:00 విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సమకాలీన పరిస్థితులను ప్రతిబింబించేలా కరోనా వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుంది. దీని ప్రభావం దేశాలపై మరియు ప్రజలపై ఎంత దారుణమైన ప్రభావం చూపిస్తుంది, వ్యాక్సిన్ వస్తే ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ చిత్రంలో ఆసక్తికరంగా చర్చించనున్నాడట. ఈ చిత్రం సరికొత్తగా ప్రేక్షకులని అలరించేలా ఉంటుందని తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ చివరిగా కల్కి అనే చిత్రాన్నితెరకెక్కించిన విషయం తెలిసిందే.
previous post