telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ధోనీ కోసం వచ్చిన వారిపై లాఠీఛార్జ్…

Ms dhoni cricketer

అభిమానుల వేషాలు శృతిమించినప్పుడు.. వారిని చెదరగొట్టక తప్పదు మరి.. అలాంటి ఘటనే ఇవాళ రాజస్థాన్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్నేహితుల కోరిక మేరకు.. జాలోర్‌ జిల్లా జాఖల్‌ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చేశారు మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ.. అయితే, ధోనీని చూసేందుకు, ఆయనతో చేతులు కలిపేందుకు అభిమానులు పోటీపడ్డారు.. ఒకరిపై ఒకరు పడి తోసుకున్నారు.. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు కూడా చినిగిపోయిన పరిస్థితి.. కుర్చీలు విరిగిపోయాయి. ఒక్కసారిగా ధోనీపైకి తోసుకురావడంతో.. వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.. పోలీసులు ఎంత విజ్ఞప్తి చేసినా పరిస్థితి చేదాటిపోతుండడంతో.. ధోనీ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. అభిమానులను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు పోలీసులు.  చేసి అభిమానులను తరిమికొట్టారు. అనంతరం పాఠశాల బిల్డింగ్‌ను ప్రారంభించి ధోనీ వెళ్లిపోయారు. అంతకుముందు స్నేహితుల ఇంట్లో టీ తాగిన ధోనీ.. వారి కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. స్థానిక జైన సమాజం ఈ పాఠశాల భవనాన్ని దాదాపు రూ.2 కోట్ల ఖర్చుతో నిర్మించారు. అయితే ప్రస్తుతం ధోని అభిమానుల పై జరిగిన లాఠీఛార్జ్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.

Related posts