telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ కేబినేట్ సమావేశం ప్రారంభం

Kcr telangana cm

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశం ప్రగతి భవన్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం, నియంత్రిత సాగు, కరోనా కట్టడి చర్యలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

కొవిడ్‌ నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించిన అంశాలు, కృష్ణా జలాల అంశం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీ, రిటైల్‌ ట్రేడ్‌, లాజిస్టిక్‌ పాలసీపై చర్చిస్తున్నారు. సమావేశానికి మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Related posts