ఏపీలో కరోనా వైరస్ అందరినీ టచ్ చేస్తోంది. వివిధ శాఖల అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
ప్రస్తుతం ఆయనకు అపోలో వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాలినేని స్పందించారు. తనకు కరోనా సోకిందని చెప్పారు. అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. పూర్తిగా కోలుకుని త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దని తెలిపారు.
ఆర్టీసీని తెచ్చి నెత్తిమీద పెట్టుకోవడం అదనపు భారమే: జేసీ