telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన పవన్

pawan

విశాఖ జిల్లాలో పరవాడ గ్యాస్ లీక్ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పవన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటన, నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఇండీస్ట్రీస్ లో విషవాయువు లీక్ ఘటన మరువక ముందే సాయినార్ సంస్థలో విషవాయువు లీకై ఇద్దరు మృతి చెందడం బాధాకరమని పవన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రసాయన పరిశ్రమల్లో రక్షణ చర్యలపై నిరంతర తనిఖీలు చేస్తుండాలని జనసేన గతంలోనే తెలిపిందని పవన్ గుర్తు చేశారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని రసాయన పరిశ్రమల్లో వెంటనే సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నందున నిపుణుల కమిటీతో విచారణ చేపట్టాలని పవన్ పేర్కొన్నారు.

Related posts