telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎమ్మెల్సీకి వైసీపీ నేత పోతుల సునీత నామినేషన్…

pothula sunitha mlc

వైసీపీ నేత పోతుల సునీత ఈరోజు ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేశారు. రెండో సెట్ దాఖలు చేసారు పోతుల సునీత. అయితే సునీత రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి తిరిగి ఆమెనే నియమించారు జగన్. సునీత నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం సలహాదారు సజ్జల, మంత్రులు బాలినేని, ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఇక సజ్జల మాట్లాడుతూ… ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటోంది. అన్ని రంగాల్లోనూ బీసీలకు, మహిళలకు పెద్ద పీట వేస్తోంది. గతంలో ఎన్నడూ చేపట్టనన్ని సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం చేపడుతోంది అని తెలిపారు. ఇక మంత్రులు బాలినేని, ఆదిమూలపు… ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ జగన్ ప్రభుత్వం పని చేస్తోంది. పేదలకు కొండంత అండగా జగన్ నిలబడుతున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సంక్షేమ కార్యక్రమాలను చేపడతూనే ఉన్నాం అన్నారు. అలా చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశారు. టీడీపీలో ఉన్నన్నాళ్లూ నాకు అన్యాయమే జరిగింది. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు అని పోతుల సునీత పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts