వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన “వాల్మీకి” సినిమా టైటిల్ మారింది. సినిమా టైటిల్ను “గద్దలకొండ గణేష్”గా మార్చారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ చిత్రంలో అధర్వ మురళి ముఖ్య పాత్ర పోషించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ సినిమాలో పూజ కనిపించేది కొద్దిసేపే అయినా ఆమెది కీలక పాత్రని దర్శకుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. తాజాగా పూజ ఈ సినిమాలోని తన పాత్ర గురించి ఇన్స్టాగ్రామ్ ద్వారా స్పందించింది. “ఒక నటిగా విభిన్న పాత్రల్లో నటించాలని నేనెప్పుడూ కోరుకుంటాను. అమాయకమైన పల్లెటూరి తెలుగు యువతి శ్రీదేవిగా నటించడం నాకు చాలా సంతృప్తిని కలిగించింది. సినిమాలో కనిపించేది కొద్దిసేపే అయినా మిమ్మల్నందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. “గద్దలకొండ గణేష్” ఈ రోజు విడుదలవుతోంది. మిమ్మల్ని థియేటర్లలో కలుస్తాను” అని పూజ పోస్ట్ చేసింది.
దీపికా ‘సైకో’, రణబీర్ ‘రేపిస్ట్’… కంగనా సంచలన వ్యాఖ్యలు