విభిన్న కథా చిత్రాలని తెరకెక్కిస్తూ మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా, ఉత్తమ టెక్నీషియన్గా రవిబాబు గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల రవిబాబు పందిపిల్ల ప్రధాన పాత్రలో “అదుగో” అనే సినిమాని రూపొందించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా “ఆవిరి” అంటూ మరో విభిన్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రంలో రవిబాబు, నేహా చౌహన్, శ్రీముక్త, భరణి శంకర్, ముక్తర్ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫ్లైయింగ్ ప్రాగ్స్ చిత్రాన్ని నిర్మిస్తుంది. సక్సెస్ ఫుల్ చిత్రాల నిర్మాత దిల్ రాజు తన సొంత బేనర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ మీదుగా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ విడుదల చేయగా… వాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ టీజర్ను చూసిన మహేష్ బాబు ట్విటర్ ద్వారా రవిబాబును అభినందించారు. చిత్రయూనిట్కు శుభాకాంక్షలు తెలియజేశారు. “హారర్ జోనర్లో తెరకెక్కిన చిత్రాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి. ఇలాంటి సినిమాలను అద్భుతంగా తీయడంలో రవిబాబు మాస్టర్. రవిబాబుకు, ‘ఆవిరి’ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్” అని మహేష్ ట్వీట్ చేశారు. అయితే మహేష్ బాబు ఈ ట్వీట్ చేయడానికి వెనుక కారణం ఇదేననే వార్తలు విన్పిస్తున్నాయి. ఈ మూవీని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు దిల్ రాజు ప్రస్తుతం మహేష్ బాబుతో “సరిలేరు నీకెవ్వరు” సినిమాని కూడా నిర్మిస్తున్నారు. అందుకే దిల్ రాజు కోరిక మేరకు మహేష్ ట్వీట్ చేసాడని ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది.
previous post
next post
రాజశేఖర్ ను ఫ్రాడ్ అన్న జీవిత… అందరూ షాక్…!?