జనసైనికులు పవన్ పిలుపు మేరకు నల్లమల అడవిలోని యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. వైఎస్ “జగన్ ఫేయిల్డ్ యాస్ సీఎం”తో పాటు సేవ్ నల్లమల అనే యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేశారు. ఇది ట్విట్టర్ ప్లాట్ఫాం నిబంధనలకి విరుద్దం. ఈ కారణంగా మీ ట్విట్టర్ అకౌంట్స్ సస్పెండ్స్ చేస్తున్నామని ట్విట్టర్ యాజమాన్యం 400 మంది అకౌంట్స్ని సస్పెండ్ చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన మద్దతుదారులు మండిపడ్డారు. అయితే నిన్న మళ్ళీ సస్పెండ్ అయిన అకౌంట్స్ పునరుద్దరించడంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. “రాజ్యాంగబద్ధమైన వ్యక్తీకర స్వేచ్చని సమర్ధించి త్వరగా రెస్పాన్స్ అయినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ పవన్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
My wholehearted thanks to @TwitterIndia for upholding the constitutional right “Freedom of Expression” by unsuspending all the @Janasenaparty followers twitter accounts and for the timely swift response.
— Pawan Kalyan (@PawanKalyan) 20 September 2019