లాక్ డౌన్ సమయంలో సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఈ అమ్మడు కొద్ది రోజులుగా వర్కవుట్స్కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా తన ఇన్స్టాగ్రాములో శరీరాన్ని విల్లులా వంచిన ఫోటోని షేర్ చేసింది పూజా హెగ్డే. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ నోరెళ్ళపెడుతున్నారు. గతంలోను పూజా ఇలాంటి ఫోటోనే షేర్ చేయగా అది ఫుల్ వైరల్ అయింది. ఇక ఇదిలా ఉంటే పూజా హెగ్డే గత రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్గా మారింది. సమంత అందంపై చేసిన పోస్ట్ పూజాకి లేని పోని చిక్కులని తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి , అల వైకుంఠపురములో ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు అఖిల్తో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్లోను నటిస్తోంది.
previous post