ఎప్పుడూ షూటింగ్లతో బిజీగా ఉండే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వీలు చిక్కినప్పుడల్లా కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్లో ఎంజాయ్ చేస్తున్నారు. తారక్ తన కుటుంబంతో కలిసి రెండు రోజుల క్రితం కుటుంబంతో పారిస్ వెళ్లాడు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భర్గవ్ రామ్తో కలిసి ఫ్రాన్స్లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే తారక్ తన ఫ్యామిలీ విషయాలను.. తన తనయుల ఫోటోలను చాలా అరుదుగా నెట్టింట్లో అభిమానులతో పంచుకుంటాడు. ఇక ఫారిన్లో తన కుమారులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు ఎన్టీఆర్. ఆదివారం తన పెద్ద కొడుకు అభయ్ రామ్ను ఈఫిల్ టవర్ ముందు బుగ్గలపై ఎన్టీఆర్ప్రేమతో ముద్ధాడుతుండగా.. అభయ్ నవ్వులు చిందిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఈరోజు తన చిన్న కుమారుడు భార్గవ్ రామ్తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసుకున్నారు. ట్రైన్లో భార్గవ్ రామ్ ని ముద్దాడుతూ కనిపించాడు తారక్. మరోవైపు.. ఎన్టీఆర్ సతిమణి ప్రణతి ఒడిలో ఎంతో ఒద్దికగా కూర్చున్నాడు భార్గవ్ రామ్. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. తారక్.. నాకు ఎన్నో చెప్పాలని ఉంది.. కానీ ప్రస్తుతానికి ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. సుమారు వారం, పది రోజులు ఎన్టీఆర్యూరప్లోనే ఉండనున్నారని తెలుస్తోంది ప్రస్తుతం ఎన్టీఆర్ తనయుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ షూటింగ్తో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్, అలియా భట్ ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 7, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్గా కనిపించనున్నారు.