telugu navyamedia
రాజకీయ

ప్రధాని మోదీకి గుడి ..

పూణెలోని ఔంద్ ఏరియాలో రోడ్డు పక్కనే ప్రధాని మంత్రి న‌రేంద్ర మోదికి ఓ వీరాభిమాని ఆలయం క‌ట్టించారు. మనదేశంలో నటులకు, ప్రియతమ రాజకీయ నేతలు, ఇతరులకు ఆలయాలు కొత్తేమీ కాదు. ఇదే కోవలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆలయం నిర్మించారు. ప్రధాని మోదీ అంటే ఓ బీజేపీ కార్యకర్తకు ఎంతో అభిమానం. ఆ అభిమానం కాస్త భక్తిగా మారింది. దీంతో తన అభిమాన నేతకు ఆలయం నిర్మించి పూజలు ప్రారంభించాడు.

పూణెకి చెందిన 37 ఏళ్ల మయుర్ ముండెకు ప్రధాని మోదీ అంటే అమితమైన ఇష్టం, గౌరవం. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం చొరవ తీసుకున్న ప్రధాని మోదీకి కూడా ఓ గుడి ఉండాలని అనిపించింది. అందుకే ఆయనకు గుడి కట్టించే బాధ్యతను తానే తీసుకున్నా అని మయుర్ తెలిపాడు.

Pune: BJP Worker Builds Temple for Modi Worth Rs 1.6L as Tribute for Building Ram Temple

కాగా పూణెలోని ఔంద్ ఏరియాలో రోడ్డు పక్కనే ప్రధాని మోదీకి కట్టించిన ఈ ఆలయం ఉంది. మయుర్ ముండె లక్షన్నరకుపైగా ఖర్చు పెట్టి ఆరు నెలల పాటు శ్రమించి ఈ గుడి కట్టించాడు. లక్షన్నరకు పైగా ఖ‌ర్చు చేసి ఈ ఆలయాన్నిక‌ట్టించి ఆగస్టు 15న ఘ‌నంగా ప్రారంభించారు. 6 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. ప్రజలు ఆసక్తిగా గమనిస్తుండగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు ఈ ఆలయాన్ని సందర్శనకు అభిమానుల తాకిడి పెరుగుతున్నది. ఈ ఆల‌య నిర్మాణాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

Related posts