తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కొద్దిసేపటి క్రితమే ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో మాట్లాడి మైత్రి కుదుర్చుకుని వచ్చి ఇక్కడి రాజకీయ వర్గాలను పవన్ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మరికాసేపట్లో పవన్ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ కానున్నారు. ఆపై, జనసేన-బీజేపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు.
ఇకనైనా కేసులు వెనక్కి తీసుకోండి… బాబుకు పోసాని సూచన