దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో స్కూళ్లకు తమ పిల్లలను తల్లిదండ్రులు జంకుతున్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైనప్పటికీ తమ పిల్లల్ని మాత్రం పంపేది లేదని ముంబై వాసులు తేల్చి చెబుతున్నారు. ఆన్లైన్ పేరెంటింగ్ సంస్థ ‘పేరెంట్ సర్కిల్’ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించగా, ముంబైలోని పిల్లల తల్లిదండ్రులు తమ మనోభావాన్ని వెల్లడించారు. ఈ సర్వేలో దేశవ్యాప్తంగా 12 వేల మంది తల్లిదండ్రులు పాల్గొనగా, వీరిలో 54 శాతం మంది ముంబై వారే కావడం గమనార్హం.
పాఠశాలలు తిరిగి ప్రారంభమైనా నెల రోజుల వరకు తమ పిల్లల్ని పంపబోమని వీరిలో 24 శాతం మంది పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల్ని స్కూలుకు పంపి సమస్యలు కొనితెచ్చుకోబోమన్నారు. ఆరు నెలల వరకు తమ పిల్లల్ని బయటకు పంపేందుకు, స్నేహితులను కలిసేందుకు, సినిమాలకు, మాల్స్కు అనుమతించబోమని 43 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు.
పవన్ కల్యాణ్ లాంగ్మార్చ్ అట్టర్ఫ్లాఫ్: విజయ సాయిరెడ్డి