ఎలక్ట్రిక్ వెహకిల్స్ బుకింగ్లో సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన ఓలా బైక్.. విడుదలకు సిద్ధమైంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానుంది. రూ.499 చెల్లించి ఈ స్కూటర్ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. అత్యధికంగా అడ్వాన్డ్స్ బుకింగ్ జరిగిన స్కూటర్గా ఓలా రికార్డ్ సాధించింది. ఇక ఓలా స్కూటర్ ప్రత్యేకతల గురించి ఆ కంపెనీ ప్రతిరోజూ ప్రచారం చేస్తే వస్తుండటంతో ఆసక్తి నెలకొన్నది. ఒకసారి చార్జింగ్ చేస్తే 150 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ పేర్కొన్నది. 0 నుంచి 50 శాతం బ్యాటరీ చార్జింగ్ కావడానికి 18 నిమిషాల సమయం పడుతుందని పేర్కొన్నది కంపెనీ. ఈ ఛార్జింగుతోనే 75 కి.మీ. ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఇందులో రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఇస్తున్నట్టు ఇప్పటికే కంపెనీ ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనం పది రంగుల్లో కనువిందు చేయనుంది. ఈ ఓలా స్కూటీలు విడుదల తరువాత ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.
previous post