జార్ఖాండ్లోని స్కూల్ హెడ్మాస్టర్కి చితకబాదారు గ్రామస్థులు. అతడి మెడలో చెప్పులు, బూట్ల దండలు వేసి ఊరంతా ఊరేగించారు. ఇదంతా జార్ఖాండ్ రాష్ర్టం రాంచీలో పశ్చిమసింగ్ భూమ్ జిల్లా బాచ్ మగుతు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సదరు మహిళ టీచర్ కి లైగింక వేదింపులకు పాల్పడుతున్నందు దేహశుద్ది చేశారు.
పాఠశాలలో తన నియామకం చట్టవిరుద్ధమని తరచూ శరీరకంగా వేధింపులకు హెడ్మాస్టర్ రమేశ్ చంద్ర పాల్పడుతున్నట్లు మహిళ టీచర్ ఆరోపిస్తుంది.అయితే తనపై ఆరోపణలకు రమేశ్ చంద్ర ఇదంతా కావాలనే చెబుతున్నారని , అబధ్ధమని ఖండిస్తున్నారు. అయితే విచారణలో నిజనిజాలు బయటపడతాయని తెలిపారు. ప్రస్తుతం అతనికి దేహశుద్ది చేసిన విడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.