telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ 30 అప్డేట్

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అరవింద సమేత’ తర్వాత ఓ సినిమా తెరకెక్కనుందని గతకొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది. నటసింహా నందమూరి బాలకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనున్నారనే వార్తా వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఫిబ్రవరి 19 సాయంత్రం 5 గంటలకు రానుంది. #Tarak30 హ్యాష్ ట్యాగ్‌తో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయట. తారక్ సరసన కథానాయికలుగా పూజా హెగ్డే, నివేధా పేతురాజ్, కియారా అద్వాణీ పేర్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ టైమ్ త్రివిక్రమ్ ఒక సోషల్ ఎలిమెంట్ తీసుకుని కథ రెడీ చేశాడట. ఈ సినిమా కోసం ‘‘అయినను పోయి రావలెను హస్తినకు’’ అనే టైటిల్ ఫిలిం చాంబర్లో రిజిష్టర్ చేయించారని తెలుస్తోంది. ఇది ఎన్టీఆర్ 30వ సినిమా.

Related posts