telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనవసరంగా అన్నానే ఆరోజు అని శ్రీరెడ్డి ఫీలయ్యేటట్టు చేస్తా… : కరాటే కళ్యాణి

Karate-Kalyani

సినీ నటి కరాటే కళ్యాణి కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి తన గురించి నోటికొచ్చినట్లు అసభ్యపదజాలంతో తప్పుడు ఆరోపణలు చేశారంటూ కేసు పెట్టిన విషయం తెలిసిందే. కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళ్యాణి మాట్లాడుతూ ‘‘శ్రీరెడ్డి లాంటి వాళ్లు రాక్షస సంతతికి చెందినవారు. వాళ్ల గురించి మనం వదిలేద్దాం అనుకున్నాం. కానీ రాక్షస స్త్రీలకు మామూలుగా చెబితే అర్థంకాదు. నేను మంచి చెప్పాను. ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని. అది వాళ్లకు చెడుగా అర్థమైంది. ఇప్పుడు లైవ్‌లోకి ఎందుకు వచ్చానంటే.. చెప్పించుకోవాల్సిన పరిస్థితి వాళ్లే తెచ్చుకున్నారు. పిచ్చి ముదిరిన తర్వాత ట్రీట్‌మెంట్ చేయాలి. ఈ మధ్యకాలంలో శ్రీరాముడిని దూషించినవారు ఉన్నారు. వారిపై నేను పోరాటం చేసాను. దాంతో వాళ్లు నాపై కక్షతో శ్రీరెడ్డిని అడ్డుపెట్టుకుని ఆమె చేత నన్ను నోటికొచ్చినట్లు తిట్టించారు. చేయించినవాళ్లు బాగున్నారు. కానీ మధ్యలో శ్రీరెడ్డి ఇరుక్కుపోయింది. నేను అందరిలాంటి దాన్ని కాను. నేను మాటలు చెప్పను. చేతలతోనే చూపిస్తాను. అనవసరంగా అన్నానే ఆరోజు అని శ్రీరెడ్డి ఫీలయ్యేటట్టు చేస్తా. శ్రీరెడ్డి తన అవసరం కోసం అడ్డదార్లు తొక్కింది. నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయ్. లీక్ చేసాను. కావాలంటే ఇప్పుడు కూడా లీక్ చేస్తాను. నేను ఆల్రెడీ శ్రీరెడ్డికి ప్రూఫ్స్ కూడా పంపించేసాను. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కాబట్టే డిబేట్లకు నేను వస్తున్నానని తెలిసి ఉచ్చపోసుకునేది. నన్ను తక్కువ చేయాలని చూసిన ప్రతీసారి ఆమే దిగజారిపోయింది. ఇప్పుడు మరింత దిగజారిపోతుంది. శ్రీరెడ్డిపై ఎఫ్‌ఐఆర్ కూడా అయిపోయింది. శ్రీరెడ్డికి శ్రీరాముడు మేలు చేస్తాడని కోరుకుంటున్నాను. ఎందుకంటే అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేయాలనేది మన ధర్మం. మనం నీతి నిజాయతీతో బతుకున్నాం. అలాంటప్పుడు వారిలాగే మనం మాట్లాడకూడదు” అంటూ ముగించారు. మరి శ్రీరెడ్డి ఏమంటుందో చూడాలి.

Related posts