telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ క్వీన్ ను వరించిన పద్మశ్రీ 

kangana

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. చిత్ర పరిశ్రమకు ఆమె చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం కంగనను ఈరకంగా సత్కరించింది. కంగనకు పద్మశ్రీ వచ్చిందని తెలిసి ఆమెకు సపోర్ట్ చేయని వారు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. త్వరలో ప్రభుత్వం తరఫున పద్మశ్రీ అందుకోబోతున్నారు. చాలా చిన్న వయసులో కంగన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. నటన పరంగా తానేంటో నిరూపించుకోవాలని ఎన్నో కలలు కన్నారు. కానీ చిత్ర పరిశ్రమ ఒకప్పుడు స్టార్ కిడ్స్‌తో, క్యాస్టింగ్ కౌచ్‌తోనే నడిచేది. అదే సమయంలో కంగన సోదరి రంగోలీపై యాసిడ్ దాడి జరిగింది. తన అక్కకు మెరుగైన చికిత్స అందించడానికి కంగన చెత్త సినిమాల్లో నటించాల్సి వచ్చిందట. ఏ పాత్రకైనా ఒప్పుకుంటానని చెప్పేది. దాంతో దర్శకులు కంగనను కేవలం రొమాంటిక్ సన్నివేశాల కోసమే తీసుకునేవారు. కానీ ఈరోజు సోలోగా సినిమాలను నడిపించేస్తోంది. ఆమె ప్రధాన పాత్రల్లో నటించిన మూడు సినిమాలకు జాతీయ అవార్డులు వరించడం విశేషం.

Related posts