తెలుగు సినిమా సత్తాను నిరూపించిన “బాహుబలి” చిత్ర విజయంలో సంగీతం కూడా ముఖ్య భూమిక పోషించిన సంగతి తెలిసిందే. కీరవాణి సమకూర్చిన బాణీలకి సంగీత ప్రేక్షకులను మైమరపించింది. తాజాగా ఈ చిత్రంలోని “ఓరోరి రాజా వీరాది వీరా” అనే పాటని మలయాళీలు అదే స్టైల్లో రూపొందించారు. బాహుబలి పాటలో మాదిరిగానే సెట్టింగ్ రూపొందించి పాట రెడీ చేశారు. జిబు జాకబ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న”ఆధ్య రాత్రి” సినిమా కోసం ఈ పాట రూపొందించారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది. ఆన్ ఆమి, రంజిత్ జయరామన్ పాట ఆలపించగా, సంతోష్ వర్మ లిరిక్స్ అందించారు. బిజిబల్ సంగీతం అందించారు. అనాశ్వర రాజన్.. ప్రభాస్ పాత్రలో సందడి చేస్తే, అనుష్క పాత్రలో అజు వర్గీస్ కనిపించింది. తాజాగా విడుదలైన సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.
previous post