తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిసింది.
ఏపీఎస్ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్ ఆర్టీసీ ఏర్పాటును తాము గుర్తించలేదంటూ ఆయన పేర్కొన్నట్లు సమాచారం. సమ్మె వ్యవహారాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ సూచించారు. తెలంగాణ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కేంద్రానికి రాసిన లేఖకు సమాధానంగా గడ్కరీ ఈ ఉత్తరం రాశారు.
కవిత, కేటీఆర్తో కల్వకుంట్ల రాజ్యం విస్తరించాలని కేసీఆర్ ప్రయత్నం: వివేక్