పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.శుక్రవారం అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, చీఆఫ్ కన్జర్వేటర్ శోభతో కలిసి కరీంనగర్లోని పోలీసు శిక్షణ కేంద్రంలో మొక్కలు నాటారు. కేంద్రం మియావాకి పద్ధతిలో పెంచుతున్న చిట్టడవిని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే కాలంలో వనాలకు చిరునామాగా కరీంనగర్ నిలుస్తుందన్నారు. పచ్చదనం తరిగి పోయి వాతావరణంలో సమతుల్యత లోపించడం వల్ల అనేక మార్పులు సంభవించాయని అన్నారు. భవిష్యత్ తరాలకు డబ్బు, ఆస్తులు అందించే కన్నా మంచి పర్యావరణాన్ని అందించడం మంచిదని పేర్కొన్నారు.