telugu navyamedia
సినిమా వార్తలు

తిరుమల శ్రీవారి క‌ళ్యాణోత్స‌వ సేవ‌లో పాల్గొన్న న‌య‌న్ విఘ్నేశ్ దంప‌తులు..

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారిని హీరోయిన్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు దర్శించుకున్నారు. జూన్‌9న త‌మిళ‌నాడులోని మ‌హాబ‌లిపురంలో ఓ స్టార్ హోట‌ల్‌లో వీరిద్ద‌రు మూడు మూళ్ల బంధంతో ఒక్క‌టైయ్యారు.

వీరి వివాహ వేడుకకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌, తన మేనేజర్‌ పూజా దద్లానీ, డైరెక్టర్‌ అట్లీ హీరో కార్తీతో పాటు కోలీవుడ్‌కు చెందిన దర్శక-నిర్మాతలు సినీ ప్రముఖులు హజరై వధూవరులను ఆశీర్వదించారు.

తొలుత‌ తిరుమలలో నయనతార, విఘ్నేష్ శివన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కార‌ణాలు వల్ల జ‌ర‌గ‌లేదు. పెళ్ళి త‌రువాత దంపతులుగా తొలిసారిగా ఆలయాన్ని సందర్శించారు.

Image

శుక్ర‌వారం ఉద‌యం తిరుమ‌ల‌కు చేరుకున్న ఈ కొత్త జంట నయనతార, విఘ్నేశ్ శ్రీవారి క‌ళ్యాణోత్స‌వ సేవ‌లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు.

Nayanthara and Vignesh Shivan visit Tirumala Tirupati as man and wife - Video goes viral - Tamil News - IndiaGlitz.com

ప్రముఖ హిందీ హీరోయిన్‌ దీపికా పదుకోన్ సైతం నేడు తిరుమల తిరుపతి విచ్చేశారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దీపికా వెంట ఆమె తండ్రి, మాజీ బాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పదుకోన్ కూడా ఉన్నారు.

Image

Related posts