మాంచెస్టర్లో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019 టోర్నీ మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్పై న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్ నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో ఇవాళ తలపడుతోంది. ఈ క్రమంలో రెండు జట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
భారత్: లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, జస్ప్రిత్ బుమ్రా.
న్యూజిలాండ్: మార్టిన్ గప్తిల్, హెన్రీ నికోల్స్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాస్టేలర్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), జేమ్స్ నీషం, కొలిన్ డి గ్రాండ్హోమ్, మిచెల్ శాన్టనర్, లాకీ ఫెర్గుసన్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.
ఈ సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ తొలి ఓవర్లోనే తన రివ్యూ కోల్పోయింది. భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన మొదటి ఓవర్ మొదటి బంతిని న్యూజిలాండ్ బ్యాట్స్మన్ గప్తిల్ ఫ్రంట్ ఫుట్ డిఫెన్స్ ఆడాడు. దీంతో బాల్ అతని ప్యాడ్లకు తగిలింది. అంపైర్ నాఔట్ ఇచ్చాడు. అయితే అది ఔట్ కావచ్చని భారత్ రివ్యూ కోరగా.. డీఆర్ఎస్లో అది నాటౌట్ అని తేలింది. దీంతో భారత్ తన ఒక్క రివ్యూను కోల్పోయింది. అయితే బుమ్రా వేసిన 4వ ఓవర్ 3వ బంతికి మార్టిన్ గప్తిల్ ఔట్ అయ్యాడు. స్లిప్లో కోహ్లికి క్యాచ్ ఇచ్చిన గప్తిల్ 14 బంతులు ఆడి కేవలం 1 పరుగు మాత్రమే తీశాడు. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్లు ఉండగా..
బ్యాట్స్మన్ హెన్రీ నికోల్స్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. భారత బౌలర్ రవీంద్ర జడేజా వేసిన 19 ఓవర్ 2వ బంతిని ఆడబోయిన నికోల్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో కివీస్ 18.2 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 69 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతుండగా.. క్రీజులో రాస్ టేలర్, కేన్ విలియమ్సన్లు ఉన్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ తన 3వ వికెట్ను కోల్పోయింది. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 35.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగుల వద్ద కొనసాగుతుండగా.. జేమ్స్ నీషమ్, రాస్ టేలర్లు క్రీజులో ఉన్నారు.