లేడి సూపర్ స్టార్ నయనతారకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే మతిభ్రమించక తప్పదు. పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసిన ఈ అమ్మడు హీరోలకి సమానంగా ఫాలోయింగ్ పెంచుకుంది. త్వరలో దర్భార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రముఖి సినిమాతో సిల్వర్స్క్రీన్పై మెరిసింది నయనతార. అయితే నయనతార భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇటీవల నయన్ తన ప్రియుడు, ప్రముఖ దర్శుకడు విఘ్నేష్ శివన్తో కలిసి కన్యాకుమారిలోని తిరుచెందూర్ ఆలయానికి వెళ్లారు. అక్కడ బీజేపీ మాజీ ఎంపీ అయిన నరసింహన్ను నయన్ కలిశారట. ఆ సమయంలో నరసింహన్ మాటల మధ్యలో బీజేపీలో చేరితే బాగుంటుంది అన్నారట. దీనిపై నరసింహన్ మీడియా ద్వారా స్పందిస్తూ.. “నేను నయనతార అనుకోని ఆలయంలో కలవలేదు. అనుకోకుండా ఇద్దరం అక్కడే ఉన్నాం. ఇటీవల నయన్ హైదరాబాద్ ఎన్కౌంటర్పై స్పందిస్తూ ఆడవాళ్లను కాపాడటానికి మరింత కఠినమైన చట్టం తేవాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి నేను నయన్తో మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో చట్టాలు, నిబంధనలు కఠినంగా ఉన్నాయని చెప్పాను. అందుకే ఆమెను బీజేపీలో చేరితే బాగుంటుందని చెప్పాను. ఎందుకంటే సౌత్లో నయనతారకు ఓ స్టార్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉంది. ఆమె రాజకీయాల్లోకి వస్తే ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఆమె ఆలోచనలు ప్రజలను ప్రభావితం చేస్తాయి. అయితే నయన్ దీనిపై స్పందించకుండా కేవలం నవ్వి ఊరుకున్నాను” అని తెలిపారు.