టాలీవుడ్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుంచి ఇష్యూపై రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
వీరిద్దరూ విడిపోవడానికి సమంత చేస్తున్న బోల్డ్ పాత్రలే కారణమని..ఆ విషయంలో అక్కినేని కుటుంబం సామ్కు ఎన్నో షరతులు పెట్టిందని…అందుకే గొడవలు జరిగాయని పలు వార్తలు పుట్టుకొస్తున్నాయి
అయితే చై, సామ్ విడాకుల వ్యవహారంపై ఇప్పటికి వరకు అక్కినేని నాగర్జున ఎక్కడా మాట్లాడలేదు.. ప్రస్తుతం ‘బంగార్రాజు’ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నఆయన, నాగచైతన్యతో కలిసి ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఇందులో భాగంగా చై-సామ్ విడిపోవడంపై తమ కుటుంబం గురించి వస్తున్న వార్తలపై నాగార్జున, చైతన్య స్పందించారు. ‘కొంతమంది కావాలని అలాంటి చెత్త వార్తలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా యూట్యూబ్ ఛానెల్స్లో ఇలాంటి వాటికి కొదవే లేదు. నాపై ఇలాంటి అసత్య వార్తలు రాసినా నేను పట్టించుకోలేదు. ‘పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు’ అనే సూక్తిని నేను నమ్ముతాను. అందుకే నా గురించి ఎప్పుడు ఎలాంటి ప్రచారాలు జరిగినా నేను అంతగా పట్టించుకోను. కానీ, నా కుటుంబం గురించి వాళ్లు నెగటివ్గా వార్తలు రాయడం నన్ను ఎంతో బాధించింది” అని నాగార్జున చెప్పుకొచ్చారు.
దీనిపై నాగచైతన్య కూడా మాట్లాడుతూ అలాంటి వార్తలను తాను పట్టించుకోనని అన్నారు. కాగా, 2017లో ప్రేమవివాహంతో ఒక్కటైన సామ్-చై జంట.. గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత ఇద్దరూ.. కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు.