టీటీడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ (ఎస్వీబీసీ) స్టూడియో హైదరాబాద్లో ఏర్పాటైంది. హిమాయత్నగర్ టీటీడీ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీబీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భక్తి చానల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.