ప్రభుత్వం ఇచ్చిన జీతాలందుకుంటూ సర్కారు నౌకరీగిరి వెలగబెడుతోన్న కొందరు అధికారులు ప్రజల్ని పీక్కుతింటున్నారు. తాజాగా కృష్ణాజిల్లా గూడూరు మండలంలో లంచగొండి తాసిల్దార్ అధికారిని రెడ్ హ్యాండెడ్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
తాసిల్దార్ ఆఫీస్ కృష్ణాజిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామం శ్రీ దేవి నాంచారమ్మ అమ్మవారి ఆలయం పేరు మీద పట్టాదార్ పాస్ బుక్ టైటిల్ డేట్ ప్రాసెస్ చేయుటకు 25000/- రూపాయలు లంచంగా అడిగిన మల్లవోలు విఆర్వో శ్రీనివాస రావు. అవినీతి నిరోధక శాఖ నీ సంప్రదించిన కోసూరి లక్ష్మీ నాంచారయ్య విజయవాడ రేంజ్ ఏసీబీ అధికారులు ఈ రోజు కోసూరి లక్ష్మి నాంచారయ్య దగ్గర మల్లవోలు విఆర్వో శ్రీనివాసరావు లంచం తీసుకుంటుండగా హ్యాండెడ్ గా పట్టుకున్నారు.