telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వివేకా హత్యకేసు దర్యాప్తుకు సీబీఐ శ్రీకారం

ys vivekananda reddy

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సృష్టించిన సంగతి తెలిసిందే. సిట్, రాష్ట్ర పోలీసులు తీవ్రస్థాయిలో విచారణ జరిపినా హంతకులెవరన్నది తెలియరాలేదు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో నేడు సీబీఐ అధికారులు దర్యాప్తుకు శ్రీకారం చుట్టారు. కడప చేరుకున్న ఏడుగురు సీబీఐ అధికారులు ఎస్పీ అన్బురాజన్ ను కలిసి వివేకా హత్యకేసు వివరాలు తెలుసుకున్నారు.

ఇప్పటివరకు ఈ కేసును విచారించిన సిట్ కీలక రికార్డులను సీబీఐకి అప్పగించనుంది. ఈ కేసులో సిట్ 1,300 మందిని విచారించినా, ఏమాత్రం పురోగతి సాధించలేకపోయింది. ఏడాది కాలం అయినా ఈ కేసులో చిక్కుముడి వీడకపోవడాన్ని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించే సమయంలో హైకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ హత్య ఘటన ఏపీకి మాత్రమే పరిమితం కాదనిపిస్తోందని సందేహం వ్యక్తం చేసింది.

Related posts