అందం, అభినయం రెండూ సమపాళ్లలో ఉన్న నటి రెజీనా కాసాండ్ర. ‘ఎస్ఎంఎస్ – శివ మనసులో శృతి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రెజీనా.. ఆ తరవాత ‘కొత్త జంట’, ‘పవర్’, ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘అ!’ సినిమాలో తన రూపం, నటనతో అందరినీ ఆశ్చర్యపరిచారు. రొమాంటిక్ సీన్స్లో నటించడానికి ఏమాత్రం సిగ్గుపడని ఈ బ్యూటీ ‘పవర్’లో రవితేజతో, ‘రారా కృష్ణయ్య’ సినిమాలో సందీప్ కిషన్తో హాట్ లిప్ లాక్ సీన్స్లో రెజీనా నటించారు. ఇది ఇలా ఉండగా నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్కు బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీని ప్రచార కార్యక్రమం కోసం నాగార్జున పలుసార్లు కమర్షియల్ యాడ్స్లో నటించారు. తాజాగా మరో కొత్త యాడ్లో నాగ్ నటించారు. ఈ యాడ్ లో నాగార్జునతో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్, హీరోయిన్ రెజీనా తెగ సందడి చేశారు. ఇందులో నాగార్జున చెల్లెలిగా రెజీనా కనిపించగా, అమితాబ్ బచ్చన్- జయమాధురి వియ్యంకులిగా కనిపించి అలరించారు. ఈ యాడ్ లో తన చెల్లెలు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లిపోతున్న సమయంలో నాగార్జున ఓదారుస్తున్నారు.
previous post
అమితాబ్ తో సమానంగా నటించాను… అయినా… : తాప్సి