telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముగ్గురితో రొమాన్స్‌ చేయనున్న అక్కినేని హీరో..!

నాగచైతన్య  ప్రస్తుతం లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. షూటింగ్ తదుపరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమా తరువాత చైతు తదుపరి ప్రాజెక్ట్ థాంక్యూ సినిమా చిత్రీకరణలో పాల్గొనాలి. ఈ సినిమా ఈ నెలలో పట్టాలెక్కనుంది. దీనికి విక్రమ్ కుమార్ దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు ముగ్గురు హీరోయిన్‌లతో నటించనున్నాడు. ఇందులో ముగ్గురు హీరోయిన్లలో ఇంకా ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ముగ్గుదు హీరోయిన్లతో నటించడం చైతుకు ఇదే మొదటి సారీ. ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో కానీ ఆ తరువాత కానీ విడుదల చేయనున్నారాని తెలిపారు. చైతు, విక్రమ్ కాంబోలో మనం సినిమా తెరకెక్కింది. మనం భారీగా హిట్ అయింది. ఆ తరువాత ఈ కాంబో ఈ సినిమాతో రిపీట్ అవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ప్రేక్షకుల చేత థాంక్యూ అనిపిస్తుందా అనేది చూడాలి.

Related posts