రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్, పూజా హిగ్దేలు చేస్తున్న రాధేశ్యామ్ దాదాపు పూర్తి కానుంది. ఆ తరువాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు. అయితే అంతకుముందే ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా మాత్రం ఎటువంటి అప్డేట్ లేకుండా ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. అదేవిధంగా ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లేట్ అవ్వదని 2022లో విడుదల చేసేందుకే నాగ్ అశ్విన్ చూస్తున్నాడన్నారు. ఇంతలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో సలార్ సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పాడు. సలార్ సినిమా షూటింగ్ కూడా వచ్చే ఏడాది ఆదిపురుష్తో పాటుగా చిత్రీకరణ మొదలుకానుంది. దాంతో నాగ్ అశ్విన్ సినిమా మరింత ఆలస్యం అవుతందని అనుమానాలు వ్యాక్తం అవుతున్నాయి. 2021లో రాధేశ్యామ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఆదిపురుష్, సలార్ సినిమాలు 2022లో విడుదల కానున్నాయని, ఆ తరువాత నాగ్ అశ్విన్ సినిమా ప్రారంభం అవుతుందని, 2023లో విడుదల అయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. మరి నాగ్ అశ్విన్ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో వేచి చూడాల్సిందే.
previous post