ఆది సాయికుమార్ హీరోగా డైమండ్ రత్నబాబు తెరకెక్కిస్తోన్న సినిమా “బుర్రకథ”. హెచ్.కె.శ్రీకాంత్ నిర్మాత. మిస్తీ చక్రవర్తి హీరోయిన్. ఈ సినిమా టీజర్ ఈరోజు విడుదలైంది. టీజర్ ఆసక్తికరంగా ఉంది. “బుర్రకథ”లో హీరోకి రెండు మెదళ్లు ఉంటాయి. రెండు మెదళ్లు ఉన్న వ్యక్తి కావడంతో హీరో రెండు భిన్న మనస్తత్వాలతో ప్రవర్తిస్తుంటాడు. అభి క్యారెక్టర్ రఫ్గా, కన్నింగ్గా కనపడుతుంటే రామ్ క్యారెక్టర్ సాఫ్ట్గా కనపడుతుంది. మిస్తీ చక్రవర్తి హీరోయిన్. టీజర్లో హీరో క్యారక్టరైజేషన్లో వేరియేషన్ చూపిస్తూనే కామెడీ దట్టించారు. రాజేంద్ర ప్రసాద్, పృథ్వి పాత్రలు బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి సినిమా చూడాలంటే మాత్రం మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. హీరో పుట్టినప్పుడు తండ్రి ఆశ్చర్యంతో చెప్పే డైలాగే “రాంగోపాల్ వర్మ తిరుపతి కి వెళ్ళినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుద్ది అని ఊహించా” అంటూ చెప్పే డైలాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.
previous post