telugu navyamedia
సినిమా వార్తలు

ప్రధాని సభలో అన్నయ్య చిరంజీవి త‌ప్ప‌ అంద‌రూ అద్భుతంగా న‌టించారు

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని మోదీ ప‌ర్య‌టించారు.అల్లూరు సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ చేశారు.

In Pics : భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ వేడుకలు, వైరల్ ఫొటోలు ఆ సభకు మోదీదో పాటు సీఎం జగన్, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి , రాష్ట్ర ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి రోజా తో పాటు సినీన‌టుడు మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

In Pics : భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ వేడుకలు, వైరల్ ఫొటోలు

తాజాగా ఆ సభపై జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడు, మెగా బ్రదర్ నాగబాబు వ్యంగ్యాస్త్రం సంధించారు. ”మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ భీమ‌వ‌రంలో అద్భుతంగా జ‌రిగిందని. ఆ స‌భ‌లో అన్న‌య్య చిరంజీవి మిన‌హా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. ఆ మ‌హాన‌టులంద‌రికీ నా అభినంద‌న‌లు ” అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో నాగబాబు చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

వైసీపీ మంత్రి రోజా , ముఖ్యమంత్రి జగన్‌ను పరోక్షంగా ఎద్దేవా చేస్తూ నాగబాబు ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

In Pics : భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ వేడుకలు, వైరల్ ఫొటోలు

అన్నయ్య చిరంజీవి కూడా అదే సభలో వినయంగా కనిపించారు.. మరి ఆయనది అద్భుత నటన కాదా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

 

Related posts