కరోనాపై నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అది కూడా కాస్త వెటకారంగా ఉండటంతో నాగబాబుపై కూడా సెటైర్లు పేలుతున్నాయి. ‘కొన్ని ప్రముఖ మతాల పెద్దలు చెప్పిందేమంటే కరోన వైరస్ని వాళ్ళ దేవుడే ఈ భూమి మీదకి పంపించాడని అంటున్నారు. అయినా ఈ దేవుళ్ళకి కోపం ఎక్కువే సుమా..’ అంటూ సెటైరికల్గా నాగబాబు చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుందిప్పుడు. మొన్నటికి మొన్న చిరంజీవి రాజ్యసభ సీట్పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు నాగబాబు. అంత బిజీలో కూడా ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్పై ట్వీట్ చేసాడు నాగబాబు. కరోనా వైరస్ వచ్చిన దానికంటే కూడా వస్తుందేమో అనే భయంతోనే చాలా మంది చనిపోతున్నారు అంటూ ట్వీట్ చేసాడు నాగబాబు. ఆయన ట్వీట్పై నెటిజన్లు ఆసక్తికరంగా రిప్లై ఇస్తున్నారు.
previous post