telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నిరసన వ్యక్తం చేయడం నేరం కాదు: మంద కృష్ణ

MRPS manda krishna comments Chandrababu

నిరసన వ్యక్తం చేయడం నేరం కాదని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మంద కృష్ణ అన్నారు. నిరసనను అడ్డుకుంటున్న ప్రభుత్వమే నేరం చేసినట్టని తెలిపారు. నియంతృత్వ ధోరణితో తమను అడ్డుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఎందుకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఎందుకు పాల్గొనడం లేదో సమాధానం చెప్పాలన్నారు. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కూడా పర్మిషన్ లేదని, దాన్నెందుకు తీయలేదని మంద కృష్ణ ప్రశ్నించారు.

అన్యాయానికి గురైనపుడు ప్రతి ఒక్కరూ స్పందించాలనన్నారు.మౌనంగా ఉండటం నేరమని మాదిగ పేర్కొన్నారు. ఈ నెల 27న అంబెద్కర్ వాదుల మహా గర్జనకు ప్రభుత్వం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రశ్నించే హక్కును కాపుడుకోవాలన్నారు. అంబేద్కర్ మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ మహాసభకు రావాలని పిలుపునిచ్చారు.

Related posts