telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైఎస్సార్ పథకాలు ఆదర్శంగా నిలిచాయి: రఘురామ కృష్ణరాజు

raghauramakrishnam raju mp

మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఒక ప్రకటనను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర‌రెడ్డి చేపట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయన్నారు. జలయజ్ఞంతో వృథా జలాల వినియోగానికి శ్రీకారం చుట్టారన్నారు.

వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన చేసిన పాదయాత్ర వలన మనోరంజకంగా పరిపాలన చేయగలిగారన్నారు .మనసున్న మారాజు వైఎస్ రాజశేఖర‌రెడ్డి అని కొనియాడారు. ఆయన ప్రజలు, ప్రజాప్రతినిధులతో నిత్యం మమేకమై, అందరికీ నేనున్నాననే భరోసా కల్పించారన్నారు.

Related posts