రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 55 రాజ్యసభ స్థానాలకు సంబంధించిన మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు మార్చి 13 , నామినేషన్ల పరిశీలన 16న, ఉపసంహరణకు తుదిగడువు 18వ తేదీగా ఈసీ పేర్కొంది.
మార్చి 26 ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగా, మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏపీ నుంచి నాలుగు, తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణకు చెందిన సభ్యులు కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్రావుల పదవీ కాలం ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన తిక్కవరపు సుబ్బరామిరెడ్డి, తోట సీతారామలక్ష్మీ, కె. కేశవరావు, మహ్మద్ అలీ ఖాన్ ల పదవి కూడా ఏప్రిల్ 9వ తేదీతో ముగుస్తుంది.