telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్ర‌బాబు, లోకేష్ ఆరిపోయే దిపాలు- రోజా హాట్ కామెంట్స్‌

వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిప‌డ్డారు.. చంద్రబాబు, లోకేష్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని అన్నారు.

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో లోకేష్ ఒక వీధి రౌడీ మాదిరే మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. ఏనాడూ కుప్పం అభివృద్ధిని పట్టించుకోలేదని , చంద్రబాబు ,లోకేష్ ఈ రోజు ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని అన్నారు. కోవిడ్ సమయంలో ఓట్లేసి గెలిపించిన కుప్పం ప్రజల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు.సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం ప్రజలు అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.

నా జీన్స్‌లోనే పేకాట, వార్త రాయిస్తారా: జగన్‌కు బిటెక్ రవి సవాల్ | BTech Ravi challenges YS Jagan in Kadapa - Telugu Oneindia

సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి రాష్ట్రంలో ప్రతి ఒక్కరు వైసీపీ ని గెలిపిస్తున్నారన్నారు. పంచాయితీ, ఎం.పి.టి.సి, జడ్పిటిసి, బద్వేలు ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ సి.పి ను భారీ ఘనవిజయంతో గెలిపించారని గుర్తు చేశారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు.

కుప్పంలో లోకేష్ మాట్లాడిన మాటలు, సవాళ్లు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కుప్పంలోనూ చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసేందుకే ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేదని విమర్శించారు.

చంద్రబాబు.. ఏనాడు కుప్పం ప్రజలకు అందుబాటులో లేరని దుయ్యబట్టారు. కుప్పం ఎన్నికల్లో కూడా ఈ తుప్పును, ఆ పప్పును ప్రజలు తరిమి త‌రిమి కొట్టి వాళ్ళ‌కి రాజ‌కీయ భ‌విష్య‌త్ లేకుండా స‌మాధి చేస్తార‌ని ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలనను చేరవేశారని ఎమ్మెల్యే రోజా కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ జగన్ రాకపోయినా వైసీపీని గెలిపిస్తున్నారని, ఆయనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

నిమ్మగడ్డ చిన్న మెదడు చితికినట్టుందన్న రోజా .. ఏకగ్రీవాలు వద్దనటానికి మీరెవరు ? వైసీపీ నేతల ఫైర్ | Roja slams Nimmagadda and YCP leaders fire on SEC's decision to stop ...

చంద్రబాబు, లోకేష్ లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని రోజా నిప్పులు చెరిగారు. అధికారులపై దాడులకు పాల్పడడం, ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచి దౌర్జన్యాలకు దిగి వైసీపీ చేస్తోందని కలరింగ్ ఇవ్వాల‌నుకుంటున్నార‌ని అన్నారు. ప‌చ్చ కామ‌ర్ల వాడికి లోక‌మంతా ప‌చ్చ‌గా ఉంటుంద‌ని, చంద్ర‌బాబు, లోకేష్ చేసే చెత్త ప‌నులు వైసీపీ మీద పెడుతున్నార‌ని అన్నారు.

తండ్రి కొడుకులు ఎన్ని ఆటలు ఆడినా కుప్పం ఎన్నికల తర్వాత రాసుకోవడానికి చరిత్ర.. చూసుకోవడానికి భవిష్యత్తు లోకేష్, చంద్రబాబులకు ఉండదంటూ స్ప‌ష్టంగా అర్ధ‌మ‌వుతుంద‌ని అన్నారు.

Related posts