telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అధికారం మత్తులో నోరు పారేసుకోవద్దు.. మీ వీపులు విమానంమోత మోగడం ఖాయం..

నిజాలను ప్రజలకు తెలియజేస్తున్న విలేకరుల వీపులు మోగడం కాదు నాలుగుకోట్ల ఆంధ్రులే మీ వీపులు విమానంమోత మోగించడం ఖాయమని కర్నూల్ మేయర్ ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు.

సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో వచ్చిన సమయంలో మధ్యాహ్నం ఎండ ఉందని నీడచాటుకు ప్రజలు వెళితే.. ఎవరూ లేరు అంటూ ఫోటోలు తీసి కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేశాయి. ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం జాగ్రత్త అని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య హెచ్చరించడం రాజకీయ దుమారం రేపుతోంది.

వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారని… అధికారులు బెదిరించి తెచ్చిన వారూ పారిపోతున్నారని లోకేష్ అన్నారు. ‘వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధుల వీపు వాయగొడతారా మేయర్ గారు.. ఇదేం రౌడీయిజం?  అంటూ  లోకేష్ నిలదీసారు. .

అధికారం మత్తులో నోరు పారేసుకోవద్దు ..వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ ఉంటాయి. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని నాలుగు కోట్లకి పైగా ఉన్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. మర్యాదగా మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. 

Related posts