telugu navyamedia
రాజకీయ

మిజోరం గవర్నర్ రాజీనామా

Mizoram Governor Resigns
మిజోరం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తొమ్మిది నెలల పాటు గవర్నర్  పదవిలో కొనసాగారు. కేరళ నుంచి లోకసభకు పోటీ చేసే ఉద్దేశంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదించినట్లు  రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి మిజోరం గవర్నర్ గా అధనపు బాధ్యతలను నిర్వహిస్తారు. 
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ పై తిరువనంతపురం స్థానం నుంచి రాజశేఖరన్ పోటీ చేయనున్నారు. కేరళలో తన అవసరం ఉందని పార్టీ అధిష్టానం భావించడంతో గవర్నర్ పదవికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. రాజశేఖరన్ 2015లో బీజీపీ  కేరళ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత 2018 మే నెలలో మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు.

Related posts