telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చనిపోయింది నేను కాదు… క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

MIsthi

‘చిన్నదాన నీకోసం’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మిస్తీ చక్రవర్తి. అయితే ఆమె శుక్రవారం చనిపోయారంటూ కొన్ని వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. దీంతో మిస్తీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలు విషయానికొస్తే… బాలీవుడ్ యువ నటి మిష్టి ముఖర్జీ (27) కిడ్నీ ఫెయిల్యూర్‌తో ప్రాణాలు వదిలారు. 2013లో వచ్చిన ‘మై క్రిష్ణా హు’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన మిష్టి ముఖర్జీ శుక్రవారం సాయంత్రం బెంగళూరులో మరణించారు. గత కొద్ది నెలలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మిష్టి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చనిపోయింది మిష్టి ముఖర్జీ అయితే మిస్తీ చక్రవర్తి అని కొన్ని న్యూస్ వెబ్‌సైట్లు వార్తలు ప్రచురించాయి. ఆఖరికి గూగుల్ సెర్చ్‌లో కూడా మిస్తీ చక్రవర్తి చనిపోయినట్టు చూపిస్తోంది. దీంతో అవాక్కైన మిస్తీ చక్రవర్తి ఇది ఫేక్ న్యూస్ అని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. “కొన్ని మీడియా రిపోర్ట్స్ ఆధారంగా నేను ఈరోజు మరణించాను. దేవుడి దయవల్ల నేను బతికే ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్నాను” అని పేర్కొన్నారు.

Related posts