telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్ర‌బాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ ప‌వ‌న్ చ‌దివారు..-జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి మంత్రి రోజా కౌంటర్

*ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు రోజా కౌంట‌ర్‌
*చంద్ర‌బాబు ఇచ్చిన స్ర్కిప్టే ప‌వ‌న్ చ‌దివారు
*తుని ఘ‌ట‌న వైసీపీ చేయించింద‌ని గ‌తంలో ప‌వ‌న్ అన్నారు
*కోన‌సీమ‌కు అంబేద్క‌ర్ పేరు పెట్ట‌డానికి విప‌క్షాలు ఒప్ప‌కున్నాయి..
*కోన‌సీమ కోసం ఆత్మ‌హ‌త్య చేసుకుంటునాన‌న్న వ్య‌క్తి ..జ‌న‌సేన‌లో ప‌నిచేసే వ్య‌క్తి..

అమలాపురంలో నిన్న జరిగిన విధ్యంసంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్య‌ల‌కు ఏపీ మంత్రి రోజా కౌంట‌ర్ ఇచ్చారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు వివాదాస్పదం చేయ‌డం బాదేస్తుంద‌ని మంత్రి అన్నారు.అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలే ఒప్పుకున్నాయని గుర్తుచేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చదివారని , ఆయ‌న ఇచ్చిన‌ ప్యాకేజీ కోసం మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

అంబేద్కర్‌ వలనే మనమంతా క్షేమంగా ఉన్నామని, అలాంటి అంబేద్కర్‌ పేరు పెడితే గొడవలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కుట్ర వెనుక ఎవరున్నారో బయటకు లాగుతామని తెలిపారు. ఇవే ప్రతిపక్షాలు గతంలో అంబేద్కర్ పేరు పెట్టాలని నిరాహారదీక్షలు చేశారని గుర్తు చేశారు . కోన‌సీమ‌ జిల్లా కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్న వ్యక్తి జ‌న‌సేన పార్టీకి చెందినవాడని రోజా ఆరోపించారు. జనసేన నాయకులతో సాయి ఫోటోలు కూడా దిగారని మంత్రి వివరించారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో తునిలో జరిగిన విధ్వంసాన్ని వైసీపీ చేయించిందని గతంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్డాన్ని కూడా విపక్షాలు ఒప్పుకున్నాయని మంత్రి రోజా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

Related posts