telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఏపీలో పిడుగులు పడే అవకాశం.. అధికారుల హెచ్చరిక

rainy situations to telugu states

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా మూడు జిల్లాలకు ఈ పిడుగు ముప్పు పొంచి ఉందని తెలిపారు. గుంటూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలలోని పలు ప్రాంతాలకు పిడుగుల ముప్పు పొంచి ఉందన్నారు. విశాఖ‌ జిల్లా పెద‌బ‌య‌లు, జి. మాడుగుల‌, పాడేరులో పిడుగుపడే అవకాశం ఉందన్నారు.

ఇక గుంటూరు జిల్లాలో బెల్లంకొండ‌, దాచేప‌ల్లి, మాచ‌వ‌రం, కారంపూడి, గుర‌జాల‌, రెంట‌చింత‌ల‌, మాచ‌ర్ల, దుర్గి, ఈపూరు, నకరికల్లులో పిడుగులు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి, ముండ్లమూరు, ఎర్రగొండపాలెం, నాగులుప్పలపాడు, క‌నిగిరి, టంగుటూరు, మార్కాపురం, పొదిలి ప్రాంతాల్లో పిడుగుపడే అవకాశం ఉందని సూచించారు.

Related posts